Home / ANDHRAPRADESH / ముద్ర‌గ‌డ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ముద్ర‌గ‌డ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంతేకాక‌, జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న స‌మాచారం తెలుసుకున్న ఏలూరు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అశేషంగా త‌ర‌లి వ‌చ్చారు. అయితే, ప్ర‌జాదార‌ణ‌తో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేల మార్క్ దాటిన సంద‌ర్భంగా వెంక‌టాపురం ద‌గ్గ‌ర పైలాన్‌ను ఆవిష్క‌రించారు.

ఇదిలా ఉండ‌గా.. వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర నిర్విరామంగా కొన‌సాగుతూ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన నేప‌థ్యంలో మాజీ మంత్రి, కాపునేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న అనుచ‌ర వ‌ర్గంతో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించార‌ని, ఈ స‌మావేశంలో వైసీపీలో చేరాలా..? వ‌ద్దా..? అనే అంశంపై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న అనుచ‌ర‌వ‌ర్గంతో చ‌ర్చించార‌ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయ నేత‌ల స‌మాచారం.

అయితే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చి.. త‌రువాత ఆ హామీని తుంగ‌లో తొక్కి కాపుల‌ను నిండా మోసం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుది అని ముద్ర గ‌డ వ్యాఖ్యానించార‌ని, అంటే చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త చూపారంటే.. ఇక ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టేన‌ని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అంటున్నారు.

అస‌లే, మ‌రో 20 ఏళ్ల‌పాటు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. మ‌రో ప‌క్క చంద్ర‌బాబు కాపుల‌కు న్యాయం చేసేది లేదు కాబ‌ట్టి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న‌ది ప‌శ్చిమ జిల్లా ప్ర‌జ‌లు అంటున్న ప్ర‌ధాన మాట‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat