Home / NATIONAL / కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్
పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .

అయితే అధికారాన్ని చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ నూట పన్నెండు స్థానాలు .కానీ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ పార్టీతో జతకట్టడానికి సిద్ధమైంది.ఇందులో భాగంగా సోనియా గాంధీ జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఫోన్ చేసి దేవెగౌడ తనయుడు అయిన కుమారస్వామికు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో దేవెగౌడ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి .

అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య గవర్నర్ ను కల్సి తన రాజీనామా లేఖను సమర్పిస్తారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విన్నవించనున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat