Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!

వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!

ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని మారంపల్లిలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తల్లితోపాటు పొలం పనులకు వెళ్తున్న ఓ చిన్నారిని చూసి ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని ఉందా అంటూ ఆ పాపతో ముచ్చటించారు. ఆ తర్వాత పాప తల్లితో మాట్లాడుతూ.. చిన్నారి ఉన్నత చదువులు చదివి పైకి రావాలంటే పొలం పనులకు కాకుండా బడికి పంపాలని సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పిల్లల చదువు భారం కాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ అక్కడి వారికి వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat