నిత్యం ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే ఏపీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటల్లో చిక్కుకుంది .దేశ రాజధాని మహానగరం ఢిల్లీ నుండి వైజాగ్ కు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ దగ్గర బిర్లా నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో అగ్నిప్రమాదానికి గురైంది .ఈ క్రమంలో ట్రైన్లోని 4 ఏసీ భోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి .
అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తం అయిన ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి బయటకు వచ్చేశారు.అయితే మొత్తం ముప్పై ఆరు మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సురక్షితంగా ఈ మంటల నుండి బయటపడ్డారు అని వార్తలు వస్తున్నాయి .
ఏపీ ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదానికి గురి కావడంతో పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి .సంబంధిత అధికారులు ప్రమాద సంఘటన చోటుకు చేరుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు .
AP express 22416 from NewDelhi to Visakhapatnam pantry caught fire just a few minutes ago Near Gwalior station. pic.twitter.com/tr2NoEXbxC
— జయహో మహానటి! (@UrsVamsiShekar) May 21, 2018