Home / JOBS / నిరుద్యోగులకు శుభవార్త పదివేల రైల్వే జాబ్స్‌కి నోటిఫికేషన్‌..!

నిరుద్యోగులకు శుభవార్త పదివేల రైల్వే జాబ్స్‌కి నోటిఫికేషన్‌..!

చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)ల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 వేలకు పైగా వేతనంతో ఎస్‌ఐ కొలువు వరిస్తుంది. అదే విధంగా కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని చేజిక్కించుకునే సువర్ణావకాశం అభ్యర్థులకు లభించింది.

నోటిఫికేషన్‌ వివరాలు
విద్యార్హత: కానిస్టేబుల్‌కు పదో తరగతి; ఎస్‌ఐకు గ్రాడ్యుయేషన్‌.
వయసు: 2018, జూలై 1 నాటికి 18– 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయడానికి అర్హులు.
దరఖాస్తు రుసుం : రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ : 2018, జూన్‌ 1 నుంచి జూన్‌ 30.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: 2018, సెప్టెంబర్‌/అక్టోబర్‌.
వెబ్‌సైట్‌: www.indianrailways.gov.in

ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్‌
కానిస్టేబుల్‌ ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216.
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat