ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.
అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మెగా కాంపౌండ్ కు చెందిన యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ ముందుకు వచ్చారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను అంటే బాబాయి వద్దు అన్నారు .కానీ ఇప్పుడు బాబాయి అనుమతిస్తే రానున్న ఎన్నికలో జనసేన తరపున ప్రచారం చేస్తాను అని ఆయన అన్నారు ,..