Home / NATIONAL / రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!

రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!

రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయాభివృద్ది – రైతుల సంక్షేమం కోసం ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా లాంటి అనేక అద్వితీయ పథకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు జీవిత బీమా సౌకర్యంతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించి, రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు.

Image may contain: 1 person, sitting

రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా సరే ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని వెల్లడించారు. రైతులకు జీవిత బీమా పథకానికి చెల్లించడానికయ్యే నిధులను బడ్జెట్లోనే కేటాయించి, ప్రతీ ఏటా ఆగస్టు 1నాడే చెల్లిస్తామని వెల్లడించారు. విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి.) ద్వారా ఈ బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రైతు ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా, సాధారణ మరణాలతో సహా రైతు ఎలా మరణించినా, ఆయన ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించే విధంగా పథకం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా మాత్రమే అయితే, ప్రభుత్వంపై వ్యయభారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత వ్యయానికోడ్చయినా సరే మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో జీవితబీమా చేస్తున్నందున ఎల్.ఐ.సి. కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కోరారు.

‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బుందుల్లో పడుతుంది. రైతుల కుటుంబాలను ఈ బాధ నుంచి తప్పించడానికి జీవితబీమా కల్పించాలని నిర్ణయించాం. మరణించిన రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమా ఉంటే, ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది.

కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఇది తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వేస్తున్న మరో ముందడుగు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు, ఎల్.ఐ.సి. ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపి వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎల్.ఐ.సి. ఆర్.ఎం. ఆర్. చందర్, డిఎం బిఎస్ నర్సింహ, డిఎం సుబ్రహ్మణ్యం, బిఎం జి. పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 7 people, people sitting

– ఎల్.ఐ.సి.తో పాటు ఇతర బీమా సంస్థల నిబంధనల ప్రకారం సాధారణ జీవిత బీమా కేవలం 18 నుంచి 60 ఏండ్ల వరకు వయస్సున్న వారికే వర్తిస్తుంది. 59 ఏండ్లలోపు వారిని మాత్రమే బీమా పథకానికి నమోదు చేసుకుంటారు. 60 ఏండ్ల వయస్సు వచ్చే వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. కాబట్టి తెలంగాణలో కూడా రైతులకు జీవిత బీమా పథకం కోసం 18 నుంచి 59 ఏండ్లలోపు వారి పేర్లు నమోదు చేస్తారు.

– ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15 నాటికి రైతు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. దాని ప్రకారమే ప్రభుత్వం రైతుల జాబితాను రూపొందించి, ప్రీమియం చెల్లిస్తుంది.

– ప్రతీ రైతుకు ప్రభుత్వం-ఎల్.ఐ.సి. సంయుక్తంగా బీమా సర్టిఫికెట్ ను అందచేస్తారు

– బీమా సొమ్ము 5 లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛను రైతుకే ఇస్తారు. ముందుగానే రైతు నుంచి నామినీని ప్రతిపాదించే పత్రం తీసుకుంటారు. దాని ప్రకారమే బీమా సొమ్ము చెల్లిస్తారు. కొద్ది రోజుల్లోనే వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల నుంచి నామిని ప్రతిపాదనల పత్రాలను సేకరిస్తారు.

– రైతు మరణించిన పది రోజుల్లోగానే 5 లక్షల రూపాయలను నామినికి అందచేస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ దృవీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించే విధంగా ప్రభుత్వానికి, ఎల్.ఐ.సి.కి మధ్య సేవా ఒప్పదం కుదురుతుంది. పదిరోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్.ఐ.సి.కి జరిమానా విధిస్తారు.

– రైతుల తరుఫున ప్రభుత్వమే ఎల్.ఐ.సి.కి ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతీ ఏడాది బడ్జెట్లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయించి, ఆగస్టు 1న ఎల్.ఐ.సి.కి చెల్లిస్తారు.

– ప్రతీ నెలా రైతుల వివరాలను వ్యవసాయాధికారులు అప్ డేట్ చేస్తారు. దాని ప్రకారం బీమా పథకానికి అర్హులయ్యే రైతుల జాబితా కూడా అప్ డేట్ అవుతుంది. ఎప్పుడు భూమి కొంటే అప్పటి నుంచి బీమా వర్తించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.

– వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా 18-59 వయస్సు గల రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరుఫున ఏకమొత్తంలో ప్రీమియం చెల్లించి, రైతుల జాబితాను ఎల్.ఐ.సి.కి అందిస్తుంది. దాని ప్రకారమే ఎల్.ఐ.సి. బీమా సర్టిఫికెట్లను ముద్రిస్తుంది. బీమా సర్టిఫికెట్లను ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతులకు పంపిణీ చేస్తుంది.

దేశ చరిత్రలో రైతులకు బీమా సరికొత్త రికార్డు: ఎల్.ఐ.సి.
————————————————————
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు 5 లక్షల జీవిత బీమా సౌకర్యం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డు అని ఎల్.ఐ.సి. ప్రకటించింది. ప్రగతి భవన్ లో బీమా పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన సందర్భంగా ఎల్.ఐ.సి. రీజనల్ మేనేజర్ ఆర్. చందర్, డిఎంలు బిఎస్ నర్సింహ, సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ‘‘గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి. కానీ అందులో సభ్యులు వేల సంఖ్యలో మాత్రమే ఉండేవారు. లక్ష నుంచి రెండు లక్షలకు మాత్రమే బీమా చేయిస్తారు. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశ్యంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం కలిగించాలని భావించింది. ఎక్కువ ప్రీమియం అయినా సరే, ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికీ 5 లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి. ఇన్ని లక్షల మంది సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతులకు జీవితబీమా పథకం ఖచ్చితంగా ఓ సరికొత్త రికార్డు’’ అని ఎల్.ఐ.సి. ప్రతినిధులు ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat