తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తుంది. ఈ రోజు ఉదయం మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో యశోద ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై, వైద్య నిపుణులను వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స గాయపడిన వారికి అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు