తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే..ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది మరణించగా…ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు..
అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గజ్వేల్ లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని సాహితిని మంత్రి హారీష్ రావు పరామర్శించారు.మంచిర్యాలకు చెందిన ప్రభాకర్ పద్మావతి ల కుమార్తె సాహితి హైదరాబాద్ లోని బాచుపల్లి ఒక ప్రముఖ కళశాలలో బీటెక్ చదువుతుంది..
సెలవులు కావడంతో ఆమె ఇంటికి బయలు దేరుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేస్కోంది..తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న సాహితితో బిడ్డా భయపడకు నేనున్నా..నీకేం కాదు..ఆధైర్యపడకు అని అంటూ యువతికి మంత్రి హారీష్ భరోసానిచ్చారు…