ఐపీఎల్ విజేత ఎవరో నేడు తెలిసిపోనుంది. సీజన్ -11లో ట్రో ఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు ఫైట్ జరగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .అయితే ఈ సీజన్లో మూడుసార్లు చెన్నైతో తలపడినప్పటికీ.. హైదరాబాద్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్లో నెగ్గడం ద్వారా ట్రోఫీ నెగ్గాలని విలియమ్సన్ సేన పట్టుదలతో ఉంది.
మరోవైపు రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సూపర్ కింగ్స్.. కప్ గెలిచి ధోనీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది.అయితే గణాంకాలు ఎలా ఉన్నా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.బ్యాట్స్మెన్ పెద్దగా రాణించకపోయినా.. బౌలర్లు రాణిస్తుండటం హైదరాబాద్కి కలిసొచ్చే అంశం అని అంటున్నారు .
ఈ క్రమంలోనే జ్యోతిష్కులు కూడా ఈ మ్యాచ్లో సన్రైజర్స్దే విజయమని చెబుతున్నారు.గతంలో ఆస్ట్రాలజర్ గ్రీన్స్టోన్ లోబో కోహ్లి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో సన్రైజర్స్ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాడు. ప్లూటో 260 ఏళ్ల తర్వాత తిరిగి సొంత రాశిలోకి ప్రవేశిస్తోంది. ఇది కేన్ విలియమ్సన్కు అనుకూలిస్తుందని అయన చెబుతున్నాడు. గురుడు, ఇతర గ్రహాలు కూడా అతడికి అనుకూలంగా ఉన్నాయని… చెన్నై జట్టు పైచేయి సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తున్నాడు.