ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ రోల్ ప్లే చేసే అర్హత వైసీపీ కోల్పోయిందన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రపై హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కామెంట్ల వర్షం కురిపించారు. కనిపించిన ప్రతీ ఒక్కరికీ ముద్దులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జగన్ ముద్దులను చూసి.. మహిళలు దగ్గరకు కూడా రావడం లేదని ఎద్దేవ చేశారు చినరాజప్ప.