ప్రముఖ విప్లవ నటుడు, ప్రముఖ నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాదాల రంగారావు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని తన సినిమాల ద్వారా చూపించారు.
ఛైర్మన్ చలమయ్య చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నవతరం అనే నిర్మాణ సంస్థను స్థాపించి యువతరం కదిలేలా సినిమాలను చిత్రీకరించి బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఎర్ర మల్లెలు, ఎర్రపావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, ఎర్ర సూర్యుడు, ప్రజాశక్తి, స్వరాజ్యం తదితర చిత్రాల్లో నటించారు. 1948 మే 25న ప్రకాశం జిల్లా ఒంగోలు జన్మించారు. మాదాల మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.