పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.ఈ మేరకు అయన ప్రధాని మోడీకి ఓ ట్వీట్ చేశారు.గత కొన్ని రోజుల నుండి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఈ రోజు ఉపశమనం లభించిందని వాహనదారులు అనుకున్నంత సేపు కూడా వారి ఆనందం నిలవలేదు . మొదట పెట్రోల్పై లీటరుకు రూ.60పైసలు తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్ది సేపటికే క్లరికల్ పొరపాటు వల్ల ఇలా జరిగిందని పెట్రోల్పై లీటరుకు కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గిందని చమురు సంస్థలు ప్రకటించాయి. అది విని విస్తుపోవడం సామాన్యుల వంతైంది. వారినే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా దీన్ని చూసి విస్తుపోయారు. పెట్రోల్ ధరపై ఒక్క పైసా తగ్గడంపై రాహుల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.‘డియర్ పీఎం.. పెట్రోల్, డీజిల్పై మీరు ఈరోజు ఒక్క పైసా మాత్రమే ధరను తగ్గించారా.! ఒక్క పైసా..? ఇది సరదా కోసం మీరు ఇచ్చిన ఐడియానా.. చాలా చెత్తగా ఉంది.. నేను గతవారం విసిరిన ఇంధన సవాల్కు ఇది సరైన స్పందన కాదు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
Dear PM,
You've cut the price of Petrol and Diesel today by 1 paisa. ONE paisa!??
If this is your idea of a prank, it’s childish and in poor taste.
P.S. A ONE paisa cut is not a suitable response to the #FuelChallenge I threw you last week. https://t.co/u7xzbUUjDS
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2018