ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం
తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ పార్టీ నుండి బరిలోకి దిగుతానో ఆగస్టు నెలలో తెలుస్తుంది అని అన్నారు .
see also:పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
ఈ క్రమంలో మధ్యలో అతని ముఖ్య అనుచరుడుతో సహా కార్యకర్తలు ,అభిమానులు పెద్దగా వైసీపీ వైసీపీ పార్టీ అని గట్టిగా అరవడం మొదలెట్టారు .దీనికి స్పందించిన రామ్ కుమార్ రెడ్డి మీరు అనుకున్న ..కోరుకున్న ..మీ ఇష్టం మేరకే కోరుకునే పార్టీలోనే చేరతాను ..ఆ పార్టీ నుండే బరిలోకి దిగుతా ..అంతే కాకుండా ఏకంగా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా ..కానీ ఆగస్టు నెల వరకు ఎదురుచూడాలని అనడంతో అక్కడ ఉన్నవారు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టి తమ అంగీకారం తెలిపారు .
see also:స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం..
దీంతో ఆగస్టు నెలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడానికి రామ్ కుమార్ రెడ్డి ఇప్పటికే గత నెలలో గూడూరు వైసీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ రాంకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో భేటీ అయ్యారు..అందుకే ఆయన ఇలా అంటున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..
see also:వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!