ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్కు వెళ్ళిన ఆయన రామోజీ నివాసంకు వెళ్ళి కన్నా ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు, కన్నా మధ్య పలు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం కన్నా ఈ సమావేశం విషయమై మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు ఉన్న పరిచయం కారణంగానే కలిశానే తప్ప తమ భేటీ వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం, రాజకీయ కారణాలు లేవన్నారు. అయితే మరోవైపు రామోజీతో కన్నా సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది. ఎయిర్ ఏషియా ఉదంతంలో చంద్రబాబు పేరు బైటకు రావడం, బిజెపిపై టీడీపీ నేతలు తారాస్థాయిలో విమర్శల నేపథ్యంలో ఏదో అతి ముఖ్యమైన విషయం చర్చించేందుకే ఈ ఇద్దరూ సమావేశం అయినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
see also:అయ్య బాబోయ్.. ఏపీ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది..!