టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, అదే సగం బలమని చెప్పిన షకలక శంకర్, అలాంటి టవల్ను తాను కూడా వాడుతుంటానని తెలిపాడు. ఇకపోతే పవన్తో కలిసి సినిమాల్లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. పవన్..సీఎం ,అవుతుంటే, ఆయనతో కలిసి ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తానని చెప్పాడు. మరి ఈ వాఖ్యలు నిజమౌతాయో లేదో చూడలి మరి.