తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికలలో ప్రజలు నమ్మకంతో అప్పజెప్పిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్
రాష్ట్రంగా నిలుపుతున్నారు.
ఈ క్రమంలో రైతాంగం కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ,ఎకరాకు నాలుగు వేల చొప్పున పంట పెట్టుబడి సాయం ,రైతు బీమా పథకం ఇలా పలు కార్యక్రమాలను అమలు చేయడం కాకుండా ఏకంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తూ రైతాంగం కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు .
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రైతు యాత్ర చేయనున్నారు అని సమాచారం .ఈ యాత్రలో రైతన్న యోగక్షేమాల గురించి తెలుసుకోవడమే కాకుండా పంట పెట్టుబడి సాయం గురించి అడిగి తెలుసుకోనున్నారు అని సమాచారం ..