గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట .
అంతే కాకుండా దేశంలో ప్రముఖ నగరాలైన న్యూ ఢిల్లీ ,ముంబై ,కలకత్తా ,చెన్నై ,హైదరాబాద్ ,బెంగుళూర్ లో ఈ సర్వే నిర్వహించింది .ఈ సర్వేలో ఉద్యోగ ఉపాధి లాంటి తదితర అంశాల గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించగా ఎక్కువ శాతం మంది ఉద్యోగాలు లేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట .ఈ క్రమంలో ఉద్యోగ కల్పన దారుణంగా ఉందని ఏకంగా 44.1 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .
అయితే ఉద్యోగ ఉపాధి కల్పన బాగుందని 31.5శాతం మంది చెప్పారు అని ఈ సర్వేలో తేలింది .అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించబడతాయా అనే అంశం మీద సరిగ్గా నాలుగేళ్ల కింద నిర్వహించిన సర్వేలో 65.1శాతం మంది జై కొడితే ఇప్పుడు వారి సంఖ్య 49.5శాతం మందికి పడిపోయింది. అంతే కాకుండా రానున్న కాలంలో ఇంకా దిగజారుతోంది అని ఇరవై శాతం మంది తెలిపారు అని సర్వే వెల్లడించింది ..