టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .తాజాగా ఆమె మెగా కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ సరసన ప్రముఖ దర్శకుడు ఎ కరుణాకరన్ నేతృత్వంలో వస్తున్నా తేజ్ ఐ లవ్యూ అనే మూవీలో నటిస్తుంది .
ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న శనివారం జరిగింది.ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .ఈ వేడుకలో నటి అనుమప పరమేశ్వరన్ మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగింది.మెగాస్టార్ తో దిగిన ఫోటో ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.దీనికి నిజంగా నమ్మలేకపోతున్నా అని ట్యాగ్ పెట్టింది .ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..