భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం .
మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు .ఆ తర్వాత 1991,96,98,99,2004సవంత్సరాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో లఖ్ నవ్ స్థానం నుండి గెలుపొంది ఆయన పార్లమెంటు లో అడుగుపెట్టారు .
పద్మశ్రీ అవార్డును పొందిన ఆయనకు 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు .యూఎన్ అసెంబ్లీలో తొలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా హిందిలో ప్రసంగించిన ఘనత ఆయన సొంతం చేస్కున్నారు ..