యువనేత,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తూ..ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేల్తు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఎంపీ సుమన్ చెన్నూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి చెన్నూరు బయలు దేరారు.
see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ
ఈ సందర్భంగా సుమన్ మరోసారి తన మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు. రాజీవ్ రహదారిపై ములుగు వద్ద ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి కనిపించరు.వెంటనే గమనించిన సుమన్..తన వాహనాన్ని ఆపించి వారి దగ్గరికి వెళ్లి పరామర్శించారు.అంతేకాకుండా వెంటనే 108 కి కాల్ చేసి అంబులెన్స్ వాహనాన్ని పిలిపించి ఆసుపత్రికి పంపించారు. అయితే రోడ్డు పై జరిగిన ప్రమాదాన్ని గుర్తించి..వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్న ఎంపీ సుమన్ పై స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు.ఎంపీ సుమన్ వెంట వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి కూడా ఉన్నారు.
see also;ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!