Home / NATIONAL / రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని సీఎం కోరనున్నారు. హైకోర్టు విభజనతో పాటు కొత్త సచివాలయం, రెండు స్కైవేల నిర్మాణం కోసం ఆర్మీ స్థలం, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన వంటి అంశాలతో పాటు బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీతో ములుగులో గిరిజన వర్సిటీకి భూములు కే టాయించినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలను మరియు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరనున్నారు.

see also:నేడే మ‌నన‌గ‌రం…ఈ ద‌ఫా మంత్రి కేటీఆర్ మ‌రో ప్ర‌త్యేక‌త‌

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat