Home / POLITICS / దానికోసమే మననగరం కార్యక్రమం..!!

దానికోసమే మననగరం కార్యక్రమం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మహా నగరంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో న‌గ‌ర‌వాసుల భాగ‌స్వామ్యం, స్పంద‌న ఎలా ఉంది? వీటిని స‌మ‌ర్థ‌వంతంగా అమలు చేయ‌డానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డం, స్థానికుల‌తో ప్ర‌త్య‌క్షంగా స‌మావేశ‌మై వారి ప్రాధాన్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపించే కార్యక్రమం “మ‌న న‌గ‌రం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

see also:రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

అందులోభాగంగానే ఇవాళఎల్బీనగర్ నాగోల్‌లో మననగరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..” ప్రజల చెంతకు పాలన తీసుకురావడానికే మననగరం కార్యక్రమం.ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. హైదరాబాద్‌లో 10జోన్లు, 50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సీఎం ఆమోదంతో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేస్తాం.హైదరాబాద్ నగరవాసులు కోరుకునే నాణ్యమైన జీవనం అందించేందుకు కృషి చేస్తున్నాం. పౌరులు చెల్లించే పన్నులతోనే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన తడి, పొడి చెత్త బుట్టలను తప్పకుండా వినియోగించాలిఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి ఆస్తిపన్నులో 5 శాతం రాయితీ కల్పిస్తున్నాం . నీటి సంరక్షణ కోసం జలం-జీవం అనే కార్యక్రమాన్నిచేపట్టాం” అని అన్నారు .

see also:నేడే మ‌నన‌గ‌రం…ఈ ద‌ఫా మంత్రి కేటీఆర్ మ‌రో ప్ర‌త్యేక‌త‌

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat