కేవలం రూ.5 లతో పేదల కడుపు నింపే పథకం అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకం.ఈ పథకం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విజయవంతంగా అమలవుతూ..ఎంతోమంది పేదలకు కడుపు నింపుతుంది.తక్కువ రూపాయలతో రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేద ప్రజల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వరకు ఎక్కువగా ఈ భోజనమే తింటున్నారు.ఈ క్రమంలోనే ఈ పథకాన్ని హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..అందులోభాగంగానే 72 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ ప్రారంభించాలని మున్సిపాల్ శాఖ ఆదేశించింది.దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లో రూ.5 భోజనం సెంటర్లను ప్రారంభించే విధంగా ఆయా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాల్ డైరెక్టర్ సూచించారు.