ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా. అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు కన్పిస్తున్నాయి.
see also:వైసీపీలోకి టీడీపీ కీలక నేత..!
దరువు టాకిస్ యుట్యూబ్ చానెళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో మాట్లాడిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 400 వందల సినిమాల్లో నటించాను.తెలుగు వారు తనని తమ ఇంట్లో ఆడబిడ్డగా ఆదరించారు. ప్రస్తుతం ప్రజల తరపున ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజా పక్షాన నిలిచే పార్టీలో చేరతాను అని అన్నారు. అంతేకాదు వైసీపీ నేతలు ఆహ్వానిస్తే ఐదు నిమిషాలు కూడ అలోచించకుండా వైసీపీలో పార్టీ కండువా కప్పుకుంటానని ఆమె అన్నారు. ఇంకా పరోక్షంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై అలుపు ఎరగని పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడుతున్న వైసీపీ లో చేరడం ఖాయమనే శోభారాణి సంకేతాలు ఇచ్చారు.