వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా డయాఫ్రం వాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సాంకేతికతపై ఏమీ అవగాహన లేని వ్యక్తి సీఎం సీటు గురించి రాత్రింబవళ్లు కష్టపడినా.. వృధా ప్రయాసే అవుతుందన్నారు.
see also:రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనయుడు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. నాడు వైఎస్ఆర్ సమక్షంలో జగన్ను విచారించారు కాబట్టే.. జగన్ కేసులు కొట్టేస్తున్నారని, అదే జగన్ను జైల్లో విచారించి ఉంటే.. ఇప్పటికే జగన్ జైల్లో ఉండేవారన్నారు. హత్యా రాజకీయాల నుంచి వచ్చిన నీవు (జగన్) నన్ను విమర్శిస్తావా అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. నా నీతి ముందు నా కాలి గోటికి కూడా సరిపోవు, 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ప్రజల కోసం నా ఆస్తులనే పోగొట్టవాడ్ని నన్ను విమర్శించే అర్హత నీకు లేదంటూ వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
see also:మరోసారి పప్పులో కాలేసిన లోకేష్ …!