ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించికపోయినా సరే, నాలుగు సంవత్సరాల్లో ఏ వర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కష్టపడి పనిచేసిన నాయకుడికి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించకుండా కుట్రలు పన్నుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంటే.. నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయకుండా చంద్రబాబుపై కుట్రలు చేస్తారా..? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.
see also:వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అలాగే, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా బీజేపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్తో చేతులు కలపమని బీజేపీ నేతల కాళ్లపై పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లోలానే.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.