అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్హౌస్పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్పై పలు హత్యలు, దొంగతనాలు, బెదిరింపులకు సంబంధిం చి రూరల్, 2వ పట్టణ పోలీస్స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి.
see also:జుగుప్సాకరమైన ఘటన.. ఒక యువకుడిపై..ఐదుగురు యువకులు అసహజ శృంగారం
ఈ క్రమంలో ఇటీవలే ఓ కేసులో రిమాండ్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. గతేడాది ఫిబ్రవరి 20వ తేదీ ఆత్మకూరు బస్టాండ్ వద్ద బుజబుజనెల్లూ రుకు చెందిన కృష్ణయ్యను నగదు కోసం బండరాయితో కొట్టి హత్యచేసిన కేసులో కూడా సాయి ప్రధాన నిందితుడు. అయితే నెల్లూరు çనగరంలోని 54వ డివిజన్ జనార్దన్రెడ్డి కాలనీలో గత కొంతకాలంగా సాయి ఓ మహిళతో సన్నితంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఆ మహిళతో గొడవ పడి దాడి చేశాడు. ఆ మహిళ నవాబుపేట పోలీస్స్టేషన్ ఎస్ఐ వి.వి.రమణయ్య వద్దకు వచ్చి సాయి తనపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
see also:అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి
దీంతో సాయిని ఎస్ఐ మందలించి పంపేశారు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వరపురం సెంటర్కు వచ్చిన సాయి బార్లో మద్యం సేవించి బయటకు రావటాన్ని గమనించిన గణేష్, అమర్ అనే ఇద్దరు యువకులు పక్కాస్కెచ్తో తమ వెంట తెచ్చుకున్న కత్తి, బీర్ బాటిళ్లతో సాయిను అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే దాడి చేశారు. దీంతో సాయి అక్కడిక్కడే మృతిచెందాడు. సాయి మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు తమ నలు గురు అనుచరులకు చెందిన రెండు బైక్లపై వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీస్స్టేషన్ ఎస్ఐలు శ్రీహరిబాబు, వి.వి.రమణయ్య, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.