Home / ANDHRAPRADESH / ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు ఊహించ‌ని స‌మ‌స్య‌. ప‌వన్ క‌ళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న‌కు ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంద‌ని…ఈ విష‌యంలో వైద్యుల‌ను ఆశ్ర‌యించ‌డంతో..ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని తేల్చిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేస్తుండ‌గా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయ‌న యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నే విష‌యంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

see also:వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

ఇలా అంద‌రిలో ప‌వ‌న్ పాద‌యాత్ర‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తున్న స‌మ‌యంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మూడునెలలుగా కంటి సమస్య బాధిస్తున్నద‌ని తెలిపింది. పాద‌యాత్ర‌ విరామ కాలంలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించాల‌కున్నారని తెలిపింది. ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని  ప్రసాద్  కంటి ఆస్పత్రి డాక్టర్లు నిర్ణయించారు. అయితే తాజాగా జరిగిన వైద్య పరీక్షలను  పరిశీలించిన డాక్టర్లు శస్త్ర  చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించడంతో  పోరాట యాత్రను తిరిగి ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని వివ‌రించింది.

see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!

ఈ నెల 26  నుంచి ప్రారంభమయ్యే ఈ మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుంది.జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించడంతోపాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కళ్యాణ్‌ సమావేశం అయ్యే అవకాశం వుంది. విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై ఉన్నార‌ని తెలిపింది.

see also:ఏపీ సర్కారు శుభవార్త ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat