మోదుగుమూడి కిషన్. ఇప్పుడు ఈ పేరే టాలీవుడ్లోని సాధారణ నటుల నుంచి.. ప్రముఖ నటుల నోట్లో నానుతున్న పేరు. సినీ ప్రేక్షకుడు సైతం ఈ పేరునే ప్రస్తావిస్తున్నాడు. కారణం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అదే చికాగో సెక్స్ రాకెట్. అసలు ఈ చికాగో సెక్స్ రాకెట్ ఎలా బయటపడింది..? పోలీసులు ఎలా నిర్వాహకులను పట్టుకోగలిగారు..? ఎవరెవరిని నిందితులుగా పేర్కొన్నారు..? ఎంతకాలం వారికి శిక్ష పడనుంది..? అసలు ఈ వ్యవహారంలో విఠులు ఎంత మంది..? హీరోయిన్లు ఎంత మంది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
see also:తెలుగు స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం..!
అయితే, ఈ వ్యవహారాన్ని మొత్తం బయటకు లాగింది ఒక చిన్న కాగితపు ముక్క అట. అవును. మీరు విన్నది నిజమే. ఒక చిన్న కాగితపు ముక్క ఈ సెక్స్రాకెట్ను వెలుగులోకి తెచ్చింది. గతంలో నాగార్జున నటించిన శివమణి చిత్రం చూశారా..? సముద్రపు ఒడ్డున దొరికిన ఓ సీసాలోని కాగితం ఆధారంగా ఆ చిత్రం కొనసాగుతుంది. అదే తరహాలో కాగితం ఆధారంగానే చికాగో సెక్స్ రాకెట్ కూడా పట్టుబడింది.
see also:వామ్మో.. చికాగో కిషన్.. విఠుల నుంచి ఇంత వసూలు చేశాడా..?
ఇక అసలు విషయానికొస్తే.. 2017 నవంబర్ 20వ తేదీన ఢిల్లీ నుంచి అమెరికా కు వచ్చిన విమానాశ్రయ ఇమ్మినిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీలోగల అమెరికా రాయభార కార్యాలయంలో వీ1, వీ2, తాత్కాలిక వీసాలు తీసుకున్నట్టు ఆ యువతి తెలిపింది. తనకు నవంబర్ 18న చికాగోలో జరగనున్న తెలుగు సభల్లో సన్మానం జరగబోతోందని, అందులో భాగంగానే తాను చికాగో వచ్చినట్టు ఆ యువతి తెలిపింది. అక్కడే ఆ యువతి దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు. సన్మానం 18వ తేదీ అయితే, ఆ యువతి 20వ తేదీ అమెరికాకు రావడాన్ని పోలీసులు అనుమానించారు. దీంతో ఆ యువతిని గట్టిగా విచారించడంతో అసలు విషయాలు బయటకు పొక్కాయి.