తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు. “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లకే పెద్ద మోసగాడు. ఎన్టీఆర్ నే నమ్మించి మోసం చేసిన గొప్ప మోసగాడు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే.
see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుంది అని అన్నారు . చంద్రబాబు ఏనాడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగలేదు. హోదా కోసం నాలుగేళ్ళ నుండి పోరాడుతుంది ప్రతిపక్ష నేత జగన్ ఒక్కరే..ఏపీ ప్రజలకు న్యాయం చేసేది కూడా జగనే..వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలందరు జగన్ కే ఓటు వేయాలి అని అయన సంచలన వాఖ్యలు చేశారు.వచ్చేనెల 11న తన జన్మదినం సందర్బంగా తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్తానని..రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా నని మోత్కుపల్లి సంచలన వాఖ్యలు చేశారు.