Home / ANDHRAPRADESH / కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి

కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..

” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు

నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికలకు రెండేళ్ల ముందు ”జాబు రావాలంటే-బాబు రావాలి” అంటూ ప్రచారం చేశాడు. గోడల మీద నినాదాలు రాయించాడు. అతడి కష్టం చూసి మాలాంటి వారిమే ఎందుకయ్యా నీకు ఈ బాధ…. కెనడా వెళ్లు…. ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటుందని చెప్పాం.

కానీ అతడు వినలేదు. చంద్రబాబు సీఎం అయ్యాకే వెళ్తానని ఇక్కడే ఉండి పనిచేశాడు. చివరకు నవీవ్ కెనడాకు పోకపోయే సరికి అతడి భార్య, కుమారుడే విజయవాడకు వచ్చేశారు. అలాంటి నవీన్‌కు ఉన్న ఒకేఒక్క పదేళ్ల కొడుకు చనిపోతే…. ఇదే చంద్రబాబు కనీసం ఎలా ఉన్నావ్…. నవీన్ అని కూడా పరామర్శించలేదు.

నవీన్‌ నా వద్దకు వచ్చి చంద్రబాబు ఇలాంటి వాడా అంటూ బోరున ఏడ్చాడు. చంద్రబాబు ఒక దుర్మార్గుడు, నీచుడు అని తిట్టిపోయాడు.

కాబట్టి చంద్రబాబు…. ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తాడు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడో చెప్పేందుకు నవీన్‌ కంటే ఉదాహరణ ఉంటుందా” అని మోత్కుపల్లి వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat