Home / NATIONAL / ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ తను అన్న మాట‌కు ఏ విధంగా క‌ట్టుబ‌డి ఉంటానో మ‌రోమారు నిరూపించుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే స‌వాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి కేటీఆర్‌ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే తెలుస్తాయి అంటూ ఉత్తం చేసిన వ్యాఖ్యలను ఆహ్వానించిన మంత్రి, ఇప్పటికే అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు బుద్ధి చెప్పారు అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ పైన తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీ రామారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ ద్రోహుల పార్టీ నే అని, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ద్రోహాలు కుట్రలు మోసాలతో కూడుకుని ఉన్నది అని ఆయన అన్నారు. 1952 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిందని తెలిపారు. కేవలం తెలంగాణ ప్రజల ఉద్యమం ఒత్తిడి వల్లనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించిందని విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ఎవరి పార్టీకి నైతికత లేదో ప్రజలు తేలుస్తారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారన్నరు. గతంలోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన స‌వాలుకి కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అయితే తన సవాలుకి తాను ఎప్పుడూ కట్టుబడే ఉన్నానని, ఉత్తంకుమార్ రెడ్డి తన మాటమీద నిలబడినా…. నిలబడకున్నా… అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.కచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని, ముందుగా ఆ విషయం తెలుసుకోవాలని ఉత్త మ్ కి హితబోధ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat