ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ వైద్యుడిగా ప్రజలకు గతంలో చేసిన సేవలను వారు అభినందించారు. మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారు.
Tags armoor IT Minister KTR jeevan reddy mla madhushekhar MLC Palla Rajeshwar Reddy
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022