Home / MOVIES / బాహుబ‌లి మ‌రో సెన్షేష‌న్ న్యూస్‌..!

బాహుబ‌లి మ‌రో సెన్షేష‌న్ న్యూస్‌..!

ప్ర‌ముఖ దర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి పార్ట్ 2 చేసిన‌ సెన్షేష‌న్ గురించి ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీసెంట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌లో దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఇక జ‌పాన్‌లో ఇప్ప‌టికీ బాహుబ‌లి ఫీవ‌ర్ త‌గ్గ‌లేదు. ఇదిలా ఉంటే బాహుబ‌లి సినిమాకు సంబంధించిన మ‌రో న్యూస్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తోంది.

అయితే, బాహుబ‌లి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాల‌న్న ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లీక్స్ ఆ ప్రీక్వెల్‌ను భారీ స్థాయిలో తెర‌కెక్కించ‌బోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

బాహుబ‌లి ప్రీక్వెట్ సినిమాగా మాత్రం రూపొంద‌డం లేదు. అది వెబ్‌సిరీస్ రూపంలో రాబోతోంద‌ట‌. అందు కోసం మొత్తం రూ.350 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.7 కోట్లు కేటాయిస్తార‌ని చెబుతున్నారు. రాజ‌మౌళితోపాటు ఈ వెబ్ సిరీస్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను దేవా క‌ట్ట కూడా చేప‌డ‌తాడ‌ని ఫిల్మ్ స‌ర్క‌ల్స్‌లో చెప్పుకుంటున్నారు. బాహుబ‌లిలోని శివ‌గామి పాత్ర నేప‌థ్యంలో ఈ వెబ్‌సిరీస్ ఉండ‌బోతోండ‌ట‌. ఈ సిరీస్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోను వెల్ల‌డికానున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat