Home / ANDHRAPRADESH / అమిత్‌షాతో రామోజీ భేటీ..!

అమిత్‌షాతో రామోజీ భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌లి కాలంలో కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు షాక్ అయ్యేలా ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న మీడియా పెద్ద వ్య‌వ‌హ‌రించారు. దీంతో బాబు టీంలో గంద‌ర‌గోళం మొద‌లైందని టాక్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..బీజేపీ జాతీయ
అధ్య‌క్షుడు అమిత్‌షాతో మీడియా మొఘ‌ల్ రామోజీ రావు స‌మావేశం అవ‌డం.

బీజేపీ తెలంగాణ రోజురోజుకు బ‌ల‌హీనప‌డుతున్న అంశం గురించి చ‌ర్చించేందుకు, 2019 ఎన్నిక‌లు, ముంద‌స్తు ప్ర‌చారం నేప‌థ్యంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే అంశాల‌ను చ‌ర్చించేందుకు అమిత్ షా హైద‌రాబాద్ టూర్ పెట్టుకున్నారు. ఉద‌యం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు సాగే ఈ స‌మావేశం అనంత‌రం ఆయ‌న నేరుగా మీడియా మొఘ‌ల్,
రామోజీ గ్రూపు అధినేత రామోజీరావును క‌లిసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అదికూడా స్వ‌యంగా రామోజీ నివ‌సిస్తున్న ఫిలింసిటీలోని ఆయ‌న‌ ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు. సాయంత్రం అయిదు గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.అయితే, ఈ స‌మావేశం టీడీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రానికి దారితీస్తోంది.ఎన్డీఏతో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పొత్తు తెంచుకోవ‌డం, అనంత‌రం ఇటు ప్ర‌ధాని మోడీపై అటు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షాపై ఆయ‌న మండిప‌డుతుండ‌టం తెలిసిన సంగ‌తే. ఇదే స‌మ‌యంలో బీజేపీ పట్ల త‌న మీడియాలో సానుకూల దోర‌ణితో రామోజీరావు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో రామోజీ ఇంటికి వెళ్లి మ‌రీ అమిత్‌షాతో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat