మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు
నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పొతే ఎలా ఉంటది ..ప్రజల్లో టీడీపీ పాలనపై ఎలాంటి అభిప్రాయం ఉంది.ఇలా పలు అంశాల గురించి చంద్రబాబు తన ఆస్థాన మీడియాకి సంబంధించిన ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా సర్వే చేయించాడు అంట .
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ,జనసేనతో కలిసి బరిలోకి దిగి గెలుపొందిన నూట ఏడు స్థానాలతో పాటుగా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ముగ్గురు ఎంపీల స్థానాల్లో కూడా సర్వే చేయించాడు అంట బాబు.అయితే ఈ సర్వేలో బాబుకు షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి అంట .ఈ క్రమంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల నలుగురు మంత్రులతో సహా మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని తేలింది అంట .అంతే కాకుండా ఎంపీలు అయితే మూడో స్థానానికి పరిమితమవుతారు అని తేలింది అంట .
ఇక నూట ఏడు (బీజేపీ మినహా)స్థానాల్లో కేవలం ముప్పై స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు (సిట్టింగ్ అయిన కానీ మార్చిన కానీ )గెలుపొందుతారు .మిగిలిన స్థానాల్లో రెండో స్థానంతోనే సరిపెట్టుకుంటారు అని తేలింది అంట .మొత్తంగా చూస్తె టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే టీడీపీ కేవలం ముప్పై నుండి నలబై స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని వైసీపీ పార్టీ నూట పది నుండి నుండి నూట ముప్పై స్థానాల్లో గెలవడం ఖాయమని ..ఇరవై ఎంపీ స్థానాలను సునాయాసంగా గెలుస్తుందని బాబు తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో తేలిందంట .అయితే ఈ విషయం తెల్సిన దగ్గర నుండి ముందు జాగ్రత్తగా సదరు న్యూస్ ఛానల్ అధిపతి తన వార్తాపత్రికలో ..న్యూస్ ఛానల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ..ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి వరస కథనాలను ప్రచురిస్తున్నాడు.సో ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో జగనే ముఖ్యమంత్రి అని తేలిందని ఆయన తన సొంత కోటరీ దగ్గర వాపోతున్నాడు అంట ..