తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కంపెనీ లో ఉద్యోగులతో కలిసి హరితహారం లో పాల్గొన్నరు.సరిగ్గా
1966 లో స్థాపించబడ్డ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపనీ 11 ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఉన్న కంపెనీ మొట్టమొదటి గోల్కొండ బ్రాందీ తో మొదలు పెట్టి ఇప్పటివరకు దాదాపు 50 యేండ్లు గా దాదాపు ఐఎం ఎఫ్ ఎల్ సంబంధించిన 20 ఉత్పత్తులను ఉత్పత్తి చెయ్యడం అనేది మంచి పరిణామం. అలాగె కంపెనీ సంబంధించిన యూనిట్ అంతా తిరిగి పరిశీలించడం జరిగింది. బాటలింగ్ దగ్గర నుండి ప్యాకింగ్ దగ్గర నుండి బార్ కోడ్ దగ్గర వరకు ,అన్ని పరిశీలించడం జరిగింది.యాంత్రీకరణ తో ప్రతి దగ్గర అన్ని మానిటరింగ్ చెయ్యడం ఎక్కడ తప్పులు దొర్లకుండా చెయ్యడం చాలా మంచి పరిణామం. ఈ కంపెనీ అనేక సామాజిక కార్యక్రమలు చేస్తుంది.
ఇక్కడ వర్షాలు వస్తే స్థానికులకు వసతులు కల్పించడం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు చేయడం సంతోషం,అభినందనియం కంపెనీ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సరఫరా అయ్యే మద్యం నాణ్యమైన మద్యం సరఫరా చెయ్యడం అభినందనీయం వారిని ఛైర్మన్ దేవీప్రసాద్ అభినందించడం జరిగింది.తెలంగాణ కు హరితహారం లో మనవంతు కృషి చేయాలని అన్నారు. ఏదైతే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ను గ్రినరి గా మార్చాలని అని అనుకుంటున్నారో అందులో మనము కూడా పలుపంచుకొవాలి..
నాల్గవ విడత హరితహారం విజయవంతం చేయలని రాష్ట్రంలోని అన్ని ఇఎమ్ఎఫెల్ డిపోలలో మరియు కంపెనిలల్లో చెట్లను నాటలని ఆయన సూచించారు. హరిత వన్నాన్నీ పెంచుదామన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బేవరాజెస్ కార్పొరేషన్ ఓఎస్డీ సంతోష్ రెడ్డి, ఆబ్కారీ శాఖ ఇఎస్ ప్రదీప్ రావు, ఎ ఐఎస్ ఉజ్వల రెడ్డి, యుఎస్ఎల్ కంపెనీ హెడ్ మైనక్ పాల్ మరియు ఆబ్కారీ శాఖ అధికారులు, కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.