ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే.
తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్యతనయుడు చేగొండి సూర్య ప్రకాష్ పార్టీలో చేరతారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి.హెచ్.సత్యనారాయణమూర్తి(బాబ్జి) కూడా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.