తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని యాబై ఒక్కటి డివిజన్ కార్పోరేటర్ మిడిదోడ్డి స్వప్న శ్రీధర్ తన గొప్పమనస్సును చాటుకున్నారు.ఈ క్రమంలో తన డివిజన్ పరిథిలో ఉంటున్న ఆర్ వెంకటమ్మ మరియు బాబుకు కి సంబంధించిన వి ఐలమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు.
ఈ క్రమంలో స్వప్న శ్రీధర్ ఆమెను నగరంలోని అమ్మా ఓల్డేజ్ ఆశ్రమంలో చేర్పించారు.ఆనంతరం ఆమె మాట్లాడుతూ యువమంత్రి కేటీ రామారావు గారి స్పూర్తిగా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను.
నా దృష్టికి వచ్చిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను అని ఆమె తెలిపారు ..ఈ కార్యక్రమంలో ఆశ్రయం నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి , 51 వ డివిజన్ వాసులు తదితరులు పాల్గోన్నారు..