Home / NATIONAL / మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?

మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు అక్కడి నుండి పారిపోయారు.ఆ టెంట్ క్రింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు.

ఈ విషయాన్నీ గమనించిన మోడీ వెంటనే తన వ్యక్తిగత, భద్రత సిబ్బందిని వెంటనే వెళ్లి వారిని కాపాడాలని ఆదేశించారు. తన సెక్యూరిటీ సిబ్బందిని సైతం రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపించారు. బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారిని కాపాడాలని మైక్ ద్వారా పిలుపునిచ్చారు.ప్రధాని మోడీ సైతం వేదిక నుంచే ఆదేశాలు ఇవ్వటంతో భద్రతా సిబ్బంది, కార్యకర్తలు వెంటనే స్పందించారు. టెంట్ కింద ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. 20 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న మోడీ తన ప్రసంగం ఆపేసి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యంపై డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకల్ ఆస్పత్రికి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని మోడీ రావటంతో అక్కడున్న వారు షాక్ కు గురైయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat