ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అతను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి తగిన విధంగా శిక్ష వేయాలని ఏపీ ప్రజలను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి నర్సింహులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్కు ఉదయం నిద్ర లేచినప్పట్నుంచి ప్రజలను ఎలా దోపిడీ చేయాలనే ఆలోచనతోనే ఉంటారని, ఆ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి.. చంద్రబాబు లాక్కున్నారని మోత్కుపల్లి అన్నారు. ఏపీలో ఇసుక మాఫియా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుకు 15 శాతం కమీషన్ చేతికి అందిందని మోత్కుపల్లి చెప్పారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇచ్చి కొనేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుందన్నారు మోత్కుపల్లి.