తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాదన ఏం చేస్తున్నాడో..? తెలిస్తే కళ్లు చెమర్చుతాయి. నిరాడంబరంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, పేదల కోసమే బతకాల్సిన ముఖ్యమంత్రి అక్రమంగా లక్షల కోట్ల రూపాయల సంపదను వెనకేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం బతకాలి.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లక్షల కోట్ల ధనాన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ తన కోసమే బతుకుతున్నాడు. ముఖ్యమంత్రి పదవి అంతా తన కోసం.. తన కుటుంబం కోసమే. చంద్రబాబు కుటుంబం వంద కోట్ల విలువైన ఇంటి అద్దాల మేడలో ఉంటుంది. అటువంటి ముఖ్యమంత్రి ప్రజా నేతగా ఎలా ఉంటాడు.? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టుల్లో చంద్రబాబు భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా, ప్రభుత్వ పరంగా అమలు చేసే ప్రతీ సంక్షేమ కార్యక్రమంలోనూ నూటికి 90 శాతం అవినీతి. మరో పక్క జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో ఇసుక దోపిడీ ద్వారా వేల కోట్ల సంపాదన ఇలా అక్రమంగా సంపాదించిన.. సంపదనంతా అమెరికా, దుబాయ్, సింగపూర్ దేశాల్లో దాచి పెడుతున్నాడు అ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.