సినిమా ఇండస్ట్రీలోని ఆడ పిల్లలంటే..ఎక్కడికి రమ్మన్నా వస్తారు.., ఏం చేయమంటే.. అది చేస్తారు.., బూతులు తిట్టినా పడి ఉంటారు…, అనే ఆలోచనలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉంటారని, ఆ విధంగానే వారు బాహ్య ప్రపంచానికి తెలియకుండా వ్యవహరిస్తుంటారని నటి శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా, గత కొంత కాలంగా టాలీవుడ్లో మహిళా నటులపై లైంగిక వేధింపులు అధిక మయ్యాయని, వాటిని ఇప్పటికైనా అదుపు చేయాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉందంటూ మహిళా సంఘాలతో కలిసి శ్రీరెడ్డి ఉద్యమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ.. చికాగో సెక్స్ రాకెట్ గురించి పెదవి విప్పింది. ఆ విషయంలో అమెరికాలోని తెలుగు సంఘాలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, వాళ్లది ఎంత తప్పుందో.. హీరోయిన్లది కూడా అంతే తప్పుందని చెప్పుకొచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. మార్పులేని మగాడు, బుర్ర సరిగాలేని మగాడు ఎక్కడైనా ఉంటాడు. అలానే, చికాగోలో కూడా ఉన్నారు. వాళ్ల వీక్నెస్ను కో ఆర్డినేటర్స్ క్యాష్ చేసుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల పేరిట సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్కు డబ్బు ఆశ చూపి రప్పించుకుంటున్నారని, అందులో భాగంగా స్టార్ హీరోయిన్స్కు అందే కమీషన్లో.. కో ఆర్డినేటర్స్కు కొంతశాతం కమీషన్ అందుతుందని శ్రీరెడ్డి వెల్లడించింది. అలా, సంవత్సరానికి రెండు మూడు సినిమాల్లో సంపాదించే సంపాదన.. కేవలం వారం రోజుల్లో చికాగోలో సంపాదించుకుంటారని, అంత పెద్ద మొత్తాన్ని సంపాదించుకునేందుకే స్టార్ హీరోయిన్స్ అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారని శ్రీరెడ్డి బహిర్గతం చేసింది.
అయితే, తెలుగు సంఘాల కార్యక్రమాలకు వెళ్లే క్రమంలో కొందరు స్టార్ హీరోయిన్స్ చేత ..నేనొస్తున్నాను.. మీరు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకండి అంటూ బైట్లు కూడా తీయించుకుంటారని, అలా వారు బైట్స్ ఇస్తున్నారంటే.. వాళ్లను బుక్ చేసుకున్న వారికి సిద్ధంగా ఉండమని సిగ్నల్ ఇచ్చినట్టే అంటూ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.