Home / MOVIES / విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?

విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవ‌లం న‌టుడిగానే కాకుండా త‌ను చేప‌డుతున్న వినూత్న కార్య‌క్ర‌మాలతో అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్‌ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఆ అవార్డుని వేలం వేసి వ‌చ్చిన సొమ్ముని పేద‌ల‌కి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కూడా కోరారు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్ తొలి అవార్డ్ ని మంచి పనికోసం ఇవ్వ‌డం ప్ర‌శంసనీయం అంటూ విజ‌య్ కోరిక‌ని తీరుస్తాన‌ని మాట ఇచ్చారు.

అందులో భాగంగానే ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా, ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి రూ.25 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల చెక్కును విజయ్ దేవరకొండకు అందించగా ఈ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నానని ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat