మన జీవితంలో మనందరినీ ఎందరో వ్యక్తులు కలుస్తూ ఉంటారు. అయితే, మనల్ని కలిసిన వారిలో.. ఎవరు ఎలాంటి వారు..? ఎవరితో ఎలా ఉండాలి..? ఎవర్ని ఏ విధంగా లొంగదీసుకోవాలి..? అన్న ప్రశ్నలకు సంబంధించి చాణుక్యుడు ఎన్నో సూత్రాలు చెప్పాడు. అయితే, ఇలాంటి విషయాలపై చాణుక్యుడుకంటే.. మహాభారతంలో చాలా విషయాలు పేర్కొనబడ్డాయి. ఈ రోజు అందులో నుంచి ఒక టాపిక్ మీ కోసం..!
మహాభారతంలో భీష్ముడు ముఖ్యుడన్న విషయం మనందరికీ తెలిసిందే. భీష్ముడు తన భీష్మ పర్వంలో ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు..? ఎందుకు చేయకూడదో తెలియజేశారు. అవేంటో చూద్దాం..!
సోమరిపోతు లక్షణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయకూడదట. ఇలాంటి వ్యక్తులకు తమ కుటుంబం పట్లకానీ, తమపట్ల కానీ, ఎలాంటి శ్రద్ధ ఉండదు. ఎలాంటి బాధ్యతలు తీసుకోరు. వీరు తిని తిరగడానికి తప్ప ఎందుకూ పనికిరారని చాణుక్యుడు కూడా పేర్కొన్నాడు.
ఇలాంటి వారు.. పనిచేయకపోవడమే కాకుండా.. వీరితో స్నేహం చేసే వ్యక్తుల పనులను చెడగొడుతూ పనులను పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు.
తాగుబోతులతో కూడా స్నేహం చేయకూడదని, ఎందుకంటే వారు సంపాదించిన కొద్దో.. గొప్పో తాగడానికే సరిపెడతారట. ఇలాంటి వ్యక్తులతో ఉంటే వారి యొక్క స్నేహితుల సంపాదనను కూడా తాగడానికే వెచ్చించేలా ప్రేరేపిస్తారట.
అదే విధంగా, ఎప్పుడూ ఈర్ష్యపడే వారితో, ఎదుటువారిని చూసి తిట్టుకునే వారితో కూడా స్నేహం చేయకూడదట. ఇలాంటి వారు మొఖం మీద బాగున్నప్పటికీ వెనకాల మన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. వీరికి పని ఉన్నంత సేపే.. లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి తమ పనులు చేయించుకుంటారట. పని అయిపోగానే మన గురించి తప్పుగామాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో ఎంత మంచిగా ఉన్నప్పటికీ వారు వారిలో ఉన్న మంచి తనాన్ని పక్కనపెట్టి..వారిలో ఉన్న చిన్న చిన్న తప్పులను పెద్దగా చూపి ప్రచారం చేస్తుంటారు.
అలాగే, తెలియని వ్యక్తులతో, స్వార్ధపరులతో కూడా ఎప్పటికీ స్నేహం చేయకూడదట. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా తమ స్వార్ధాన్ని చూసుకుంటారే కానీ.. తమ పక్కనున్న వారి అవసరాలను ఎప్పటికీ గుర్తించరట. ఇలాంటి వ్యక్తులతో ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసినా వారి స్వార్ధాన్నే వారు చూసుకుంటారు కానీ.. పక్కవారి గురించి ఇసుమంత కూడా పట్టించుకోరట.