Home / Uncategorized / సినీ న‌టుడు పృథ్వీరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సినీ న‌టుడు పృథ్వీరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు వ‌స్తున్న‌విశేష ప్ర‌జాదార‌ణ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని సినీ న‌టుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం వైఎస్ జ‌గ‌న్ త‌న చేతుల మీదుగా మై డియ‌ర్ మార్తాండమ్‌ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌మ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చాలా బాగుంద‌న్నారు. చంద్ర‌బాబు స‌ర్కాఱ్ వైఫ‌ల్య‌మే.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ వెంట న‌డిచేలా చేసింద‌న్నారు. పేద‌లు, రైతులు, మైనార్టీలు, రాష్ట్రంలో ఉన్న అంద‌రూ అన్ని ర‌కాల వృత్తుల వారు, డ్వాక్రా మ‌హిళ‌లు ఇలా ప్ర‌తీ ఒక్క‌రు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో అశేష సంఖ్య‌లో పాల్గొంటున్నార‌న్నారు.

అఖండ గోదావ‌రిని దాటుతూ రాజ‌మండ్రి రైల్ క‌మ్ రోడ్ వార‌ధి మీద వ‌స్తున్న‌ప్పుడు టాలీవుడ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం బాహుబ‌లికి మించి ఉండింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై అభిమానంతోటి, ఆయ‌న సిద్ధాంతాల‌పై ఉన్న న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లంద‌రూ వైసీపీ వైపే ఉన్నార‌న్నారు. తుఫాన్ వ‌చ్చే నిశ్శ‌బ్దం ఎలా ఉంటుందో..? అలాగే, వైసీపీ కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌న్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat