టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం.
ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే ఈ మూవీలో పాట పాడితే కొంత మొత్తాన్ని ఇస్తామని ముందు ఒప్పందం జరిగింది.
పాట పాడినాక .అది బయటకు వచ్చిన తర్వాత బంపర్ హిట్ అయింది. అయితే ముందుగాల అనుకున్న పారితోషకం తనకు ఇవ్వలేదు. నిర్మాతలను అడిగిన లాభం లేదు.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ను అడిగిన లాభం లేదు. నన్ను నమ్మించి మోసం చేశారు అని ఆమె వాపోయారు..