వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాజమహేంద్రవరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ షర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ కుట్రలో భాగంగానే వైసీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
అలా, వైసీపీపై చేస్తున్న పసలేని ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని, టీడీపీపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో ప్రజల్లో వైసీపీపై రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రభుత్వంలోని అధికార పక్ష నేతలు ముడుపులు అందుకుని, మాస్టర్ ప్లాన్ను ఆమోదించి రాజమహేంద్రవరంకు అన్యాయం చేశారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, న్యాయ పోరాటం చేసేందుకుతాము సిద్ధమయ్యామని షర్మిలారెడ్డి అన్నారు.