త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్పై ఫైరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేతన్నలను ఆదుకుంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చేనేతలతో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. తన నాలుగేళ్ల పాలనలో చేనేతలకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంతోపాటుగా రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురుతుదని కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. టీడీపీకి ఓటు వేయనీయమంటూ వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడం గమనార్హం.